కరెంట్ అఫైర్స్.. 21న ఢిల్లీ సీఎంగా ఆతిశీ ప్రమాణస్వీకారం

81చూసినవారు
కరెంట్ అఫైర్స్.. 21న ఢిల్లీ సీఎంగా ఆతిశీ ప్రమాణస్వీకారం
ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన ఆతిశీ ఢిల్లీ ముఖ్యమంత్రిగా సెప్టెంబరు 21న ప్రమాణం చేయనున్నారు. ఈ మేరకు పార్టీ గురువారం అధికారికంగా వెల్లడించింది. ఆమెతో పాటు పలువురు నేతలు కేబినెట్‌ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నట్లు తెలిపింది. ఈసారి డిప్యూటీ సీఎంగా ఎవర్నీ నియమించే అవకాశాలు కన్పించట్లేదు. షీలా దీక్షిత్‌ (కాంగ్రెస్‌), సుష్మా స్వరాజ్‌ (బీజేపీ) తర్వాత ఢిల్లీకి మూడో మహిళా ముఖ్యమంత్రిగా ఆతిశీ నిలవనున్నారు.

సంబంధిత పోస్ట్