భారీ వర్షాలకు చింతపల్లి లో కూలిన బ్రిడ్జి

84చూసినవారు
గత రెండు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలు నేపథ్యంలో అల్లూరు జిల్లా చింతపల్లి, రింతాడ మార్గ మధ్యలో సోమవారం బ్రిడ్జి కూలిపోయింది. ఫలితంగా చింతపల్లి నుంచి జీకే వీధి, సీలేరు, భద్రాచలం వెళ్లే మార్గం కాకుండా పెద్దవలస మీదుగా కేడీపేట కొయ్యూరు మీదుగా రాజమండ్రి వెళ్లే మార్గాలు పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ఆ ప్రాంత ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.

సంబంధిత పోస్ట్