పాడేరు: పిడుగుపాటుకు ఆవుదూడ మృతి

73చూసినవారు
పాడేరు: పిడుగుపాటుకు ఆవుదూడ మృతి
అల్లూరి జిల్లాలోని జీ.మాడుగుల మండలం గెమ్మెలి పంచాయతిలో గల గొడుగురాయి గ్రామంలొ శనివారం భారీ వర్షం కురిసింది. ఈ క్రమంలో పిడుగు పాటు సంభవించడంతో వంజరి పిన్నం నాయుడు అనే రైతులకు చెందిన ఆవుదూడ మరణించింది. ఈ ఘటన పై పశువుల యజమాని వంజరి పిన్నం నాయుడు తాను ప్రేమతో పెంచుకున్న ఆవు, దూడ మరణించడంతో తీవ్ర ఆవేధనకు గురయ్యాడు.

సంబంధిత పోస్ట్