ఉద్యోగి మృతి పై సమగ్ర విచారణ నిర్వహించాలి

63చూసినవారు
పరవాడ లైఫ్ సైన్స్ ఫార్మసిటీలో ఉద్యోగి సూర్యనారాయణ మృతిపై సమగ్ర విచారణ నిర్వహించాలని సిఐటియు అనకాపల్లి జిల్లా ఉపాధ్యక్షులు గనిశెట్టి సత్యనారాయణ డిమాండ్ చేశారు. పరవాడలో ఆయన గురువారం బాధిత కుటుంబ సభ్యులతో కలిసి మాట్లాడుతూ మృతి చెందిన ఉద్యోగి కుటుంబానికి కోటి రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్మికుల భద్రత సంక్షేమాన్ని యాజమాన్యాలు పట్టించుకోవడంలేదని విమర్శించారు.

సంబంధిత పోస్ట్