రోడ్డు ప్రమాదంలో బీటెక్ విద్యార్థి మృతి

71చూసినవారు
రోడ్డు ప్రమాదంలో బీటెక్ విద్యార్థి మృతి
రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బీటెక్ విద్యార్థి బోర మహేశ్ మృతి చెందాడు. భీమిలి దరి పాత పరదేశిపాలెం ప్రాంతానికి చెందిన అతను స్నేహితులతో కలిసి శుక్రవారం సరిపల్లి దరి వాటర్ పార్కుకు వచ్చాడు. సాయంత్రం తిరుగు ప్రయాణంలో ద్విచక్రవాహనంపై వెళ్తుండగా సరిపల్లి పెట్రోల్ బంకు వద్ద లారీ ఢీకొట్టడంతో తలకు గాయమైంది. స్థానికులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం ఉదయం మరణించాడు.

సంబంధిత పోస్ట్