పెందుర్తి నియోజకవర్గం పరవాడ మండల కేంద్రంలో ఎమ్మార్వో ఆఫీస్ కి సమీపంలో ఫార్మా వ్యర్థ రసాయనిక కెమికల్స్ దొంగ చాటుగా యాజమాన్యం డంప్ చేసి. ఆ సంఘటన వివాదస్పదం అవడంతో గుట్టుచప్పుడుగా అగ్గిపెట్టిన ఫార్మా యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గని శెట్టి సత్యనారాయణ డిమాండ్ చేశారు. సోమవారం ఆయన పరవాడలో మీడియాతో మాట్లాడారు.