విశాఖ దక్షిణనియోజకవర్గంలోని జనసేన పార్టీలో విభేదాలు భగ్గుమన్నాయి. జనసేన నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్ కు టికెట్ కేటాయిస్తే సహించేది లేదంటూ కార్పొరేటర్ మహమ్మద్ సాదిక్ అభిమానులు ఆందోళన నిర్వహించారు. అటు వంశీకృష్ణ, ఇటు సాదిక్ అమ్మల మధ్య ఘర్షణ వాతావరణం బుధవారం చోటుచేసుకుంది. ఇలా జనసైనికులు రోడ్డున పడడంతో ప్రజలు నవ్వుకుంటున్నారు.