కూటమితోనే రాష్ట్రాభివృద్ధి

53చూసినవారు
విశాఖదక్షిణ నియోజకవర్గంలోని ఉమ్మడి అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్‌ (జనసేన పార్టీ) శనివారం విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. 35 వ వార్డు పూర్ణామార్కెట్ దుర్గాలమ్మ గుడి వద్ద తెలుగుదేశం జనసేన భాజపా నేతలు తరలిరాగా. ఓటు వేయాలని వంశీకృష్ణ ప్రజలను అభ్యర్థించారు. కూటమితోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, వైసీపీ పాలన నుంచి త్వరలోనే విముక్తి లభించనుందని వంశీకృష్ణ పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్