విశాఖ జాయింట్ క‌మిష‌న‌ర్‌కు బ‌దిలీ

78చూసినవారు
విశాఖ జాయింట్ క‌మిష‌న‌ర్‌కు బ‌దిలీ
ఏపీలో 16 మంది ఐపీఎస్‌ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం బుధ‌వారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖలోని జాయింట్‌ పోలీసు క‌మిష‌న‌ర్‌గా ఉన్న ఫ‌కీర‌ప్ప‌ను బ‌దిలీ చేసింది. ఆయ‌న‌కు ఇంటెలిజెన్స్‌ ఎస్పీగా పోస్టింగ్ ఇచ్చింది. విశాఖ‌లో ప‌లు కేసుల ఛేద‌న‌లో ఫ‌కీర‌ప్ప త‌న ప్ర‌తిభ‌ను చాటుకున్నారు. ఇటీవ‌ల జ‌రిగిన శిశువిక్ర‌యాల కేసులో నిందితులను ప‌ట్టుకోవ‌డంలో త‌న వంతు పాత్ర పోషించారు.

సంబంధిత పోస్ట్