విశాఖ: రూ. 86 లక్షల చోరీ సొత్తు స్వాధీనం

55చూసినవారు
విశాఖ: రూ. 86 లక్షల చోరీ సొత్తు స్వాధీనం
విశాఖ నగరంలో గత నెలలో 105 దొంగతనాలు జరగగా 77 కేసులు చేదించినట్లు విశాఖ పోలీస్ కమిషనర్ శంఖబ్రత తెలిపారు. ఆదివారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడారు. 86 లక్షల చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నామన్నారు. బాధితులకు వారి వస్తువులను అందించినట్లు చెప్పారు. చోరీ అయిన వస్తువుల్లో బంగారం, వెండి, నగదు వివిధ వాహనాలు ఉన్నాయి అన్నారు.

సంబంధిత పోస్ట్