దేవాలయ పరిరక్షణ ఉద్యమంలో భాగంగా ఇప్పటి వరకు 9వేల గ్రామాలు సందర్శించామని, త్వరలో విశాఖ జిల్లా లోని అన్ని గ్రామాలు పర్యటించి అక్కడి దేవాలయాల పరిరక్షణకు, అభివృద్ధికి సూచనలు అందిస్తామని, విజయవాడ భువనేశ్వరీ పీఠం 6వ పీఠాధిపతి శ్రీ కమలానంద భారతి స్వామి అన్నారు. ఆదివారం విశాఖ నగరంలోని శంకర మఠంలో వివిధ అర్చక పురోహిత సంఘాలు, దేవాలయం నిర్వహణ కమిటీలవారిని ఉద్దేశించి ఆయన అనుగ్రహ భాషణం చేశారు.