భ‌వ‌న నిర్మాణ కార్మికుల ఆందోళ‌న‌

56చూసినవారు
విశాఖ ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గంలోని సింగ్ హోటల్ జంక్షన్ వద్ద భవన నిర్మాణ కార్మికులు మంగ‌ళ‌వారం ఆందోళ‌న నిర్వ‌హించారు. ఉచిత ఇసుక ల‌భించ‌క తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నామ‌ని భ‌వ‌న నిర్మాణ కార్మిక నేత న‌ర‌సింగ‌రావు పేర్కొన్నారు. ఇసుక దొర‌క‌క‌పోవ‌డంతో ప‌నులు లేక కార్మికులు ఇబ్బందులు ప‌డుతున్నా ర‌న్నారు. భవన నిర్మాణ కార్మికుల సంఘంనేత చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు.

సంబంధిత పోస్ట్