విశాఖ వేదికగా మారీటైం ఎక్ససైజ్‌ మలబార్‌ 2024

79చూసినవారు
విశాఖ వేదికగా మారీటైం ఎక్ససైజ్‌ మలబార్‌ 2024
మారిటైమ్‌ ఎక్సర్‌ సైజ్‌ మలబార్‌ 2024 కు భారతదేశం ఆతిథ్యం ఇవ్వనుంది. విశాఖ వేదికగా అక్టోబర్‌ 8 నుండి 18 వరకు మొదట హార్బర్‌ ఫేజ్‌, తర్వాత సి ఫేజ్‌ లలో ఇది జరుగుతుంది. ఈ వ్యాయామంలో భారతదేశంతోపాటు ఆస్ట్రేలియా, జపాన్‌, అమెరికాల నావికా దళాలు పాల్గంటాయని అధికారులు శ‌నివారం తెలిపారు. ఈ మలబార్‌ విన్యాసాలు హిందూ మహాసముద్రం, ఇండో – పసిఫిక్‌ ప్రాంతంలో పరస్పర సహకారాన్ని పెంపొందించడం కోసం నిర్వ‌హించ‌నున్నారు.

సంబంధిత పోస్ట్