తిమ్మరాజు పేట ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న ముగ్గురు చిన్నారులు ఆదర్శ పాఠశాలకు ఎంపికయ్యారు. ఆరో తరగతి ప్రవేశానికి జరిగిన పరీక్షలో ప్రతిభ చూపిన జ్యోతిక అపర్ణ, అలమండ ధరణ్, పప్పు దబిత పాటిపల్లి ఆదర్శ పాఠశాలకు ఎంపికైనట్లు ఆదివారం ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు మారిశెట్టి వెంకట అప్పారావు తెలిపారు. ఈ విద్యార్థులను సర్పంచి శరగడం భాగ్యలక్ష్మి, తల్లిదండ్రుల కమిటీ చైర్మన్ ఆడారి అనంతరావు అభినందించారు.