పరిపాలనతో పాటు సాహితీవేత్తలకు శ్రీకృష్ణ దేవరాయలు యుగం స్వర్గధామంగా ఉండేదని వైసిపి ఇన్ చార్జి గుడాల గోపి చెప్పారు. శ్రీ కృష్ణ దేవరాయలు 553 వ జయంతి సందర్భంగా పాలకొల్లు గాంధీ బొమ్మ సెంటర్ వద్ద శనివారం ఆయన విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు ఆయన తెలుగు భాషకు చేసిన కృషిని అభినందించారు. దేశ భాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణదేవరాయలు చెప్పారన్నారు.