పాత్రికేయులపై బెదిరింపులు ఆపాలంటూ ఆర్డీవో, సిఐలకు వినతిపత్రం

70చూసినవారు
పాత్రికేయులపై బెదిరింపులు ఆపాలంటూ ఆర్డీవో, సిఐలకు వినతిపత్రం
పాత్రికేయులపై బెదిరింపులకు పాల్పడుతున్న విషయంపై సోమవారం తాడేపల్లిగూడెం ఆర్డీవో బిఎస్ఎన్. రెడ్డి, పట్టణ సీఐ సుబ్రహ్మణ్యంకు ప్రెస్ క్లబ్ సభ్యులు వినతి పత్రం అందజేశారు. ఏపీయూడబ్ల్యూజే జిల్లా కార్యదర్శి గజపతి వరప్రసాద్, ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రంగ సురేష్ మాట్లాడుతూ 'రచ్చ' మీడియాలో వచ్చిన వార్తలకు స్పందిస్తూ వ్యతిరేక వర్గం బెదిరింపులకు పాల్పడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్