గతం కంటే పది రెట్లు అభివృద్ధి చేశాం: మంత్రి కారుమూరి

69చూసినవారు
గత టిడిపి హయాంలో కంటే పది రెట్లు అభివృద్ధి చేయగలిగామని రాష్ట్ర మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఆదివారం ఇరగవరం మండలం రేలంగి గ్రామంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన ఇంటింటికి పర్యటించి రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని సీఎం చేయాలని కోరారు. ఎన్నికలు అనంతరం గ్రామాల్లో మరింత అభివృద్ధి చేపడతామని చెప్పారు. ఏ గ్రామానికి వెళ్లినా మరోసారి సీఎం జగన్ కావాలని కోరుకుంటున్నారన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్