గోపవరంలో ఉచిత పశువైద్య శిబిరం నిర్వహణ

67చూసినవారు
గోపవరంలో ఉచిత పశువైద్య శిబిరం నిర్వహణ
నిడదవోలు మండలం గోపవరం గ్రామంలో ఐటీసీ బంగారు భవిష్యత్తు వారి ఆధ్వర్యంలో బుధవారం ఉచిత పశువైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా పశువులకు గర్భసంచి వ్యాధులకు చికిత్స అందించి, మినరల్ మిక్సచర్ ప్యాకెట్ లు, డి వార్మింగ్ బాటిల్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో తాళ్లపూడి పశువైద్య అధికారి బాలాజీ శంకర్, జంగారెడ్డిగూడెం వెటర్నరీ సూపర్ వైజర్ వి. వెంకట రెడ్డి, మాధవ్, రమణ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్