42 హెక్టార్లలో ఉద్యాన పంటలకు నష్టం

77చూసినవారు
42 హెక్టార్లలో ఉద్యాన పంటలకు నష్టం
ప. గో. జిల్లా వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు 42. 86 హెక్టార్ల విస్తీర్ణంలో ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లినట్లు ఆశాఖ జిల్లా అధికారి దేవానంద కుమార్ బుధవారం తెలిపారు. నరసాపురం, మొగల్తూరు, పెనుగొండ, తాడేపల్లిగూడెం, యలమంచిలి మండలాల్లో 2, 862 మంది రైతులకు చెందిన కూరగాయల తోటలు దెబ్బతిన్నాయన్నారు. యలమంచిలి, ఆచంట మండలాల్లోని లంక గ్రామాల్లో 50 హెక్టార్లలో అరటి తోటలు మునిగిపోవడంతో పంట దెబ్బతినే అవకాశం ఉందన్నారు.

సంబంధిత పోస్ట్