పశ్చిమగోదావరి: మార్టేరులో బాల్య వివాహాన్ని స్థానిక అధికారులు అడ్డుకున్నారు. ఆచంటకు చెందిన 17ఏళ్ల బాలికకు పోడూరు మండలం పండితవల్లూరుకు చెందిన ఓ వ్యక్తితో వివాహం నిశ్చయించి మార్టేరులోని ఓ ఆలయంలో జరిపేందుకు ఏర్పాట్లు చేశారు. సమాచారం అందుకున్న జిల్లా ఉన్నతాధికారులు స్థానిక ఐసీడీఎస్ సూపర్వైజర్ శ్యామలాంబ, మహిళా పోలీసు హరిత, అంగన్వాడీ సిబ్బందిని అక్కడికి పంపి వివాహాన్ని నిలిపివేయించి, వారికి కౌన్సిలింగ్ ఇప్పించారు.