వశిష్ట గోదావరి వరద ఉధృతి తగ్గుముఖం

59చూసినవారు
వశిష్ట గోదావరి వరద ఉధృతి తగ్గుముఖం
వశిష్ట గోదావరి వరద ఉధృతి మరింతగా తగ్గింది. దీంతో శనివారం పెనుగొండ మండలంలోని సిద్ధాంతం, కోడేరులోని పుష్కరఘాట్లు బయట పడుతున్నాయి. వరద నీరు తగ్గడంతో రేవులన్నీ మట్టితో నిండిపోయాయి. లంక గ్రామాల్లో రహదారులు సైతం బురదతో నిండిపోయాయి. మరింతగా తగ్గే వరకూ లంక గ్రామాల నుంచి రాకపోకలు నియంత్రించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

సంబంధిత పోస్ట్