మే నెలలో జరగబోవు ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల కన్నా ఉత్తమ ప్రదర్శన చూపిస్తుందని కేంద్రంలో అధికారంలోకి వస్తుందని ఎఐసిసి ఎలక్షన్ అబ్జర్వర్ మనోజ్ చౌహాన్ అన్నారు. ఈ మేరకు బుధవారం భీమవరం పట్టణంలో కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అలాగే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సిపిఎస్ ని రద్దు చేస్తామని, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకుంటామన్నారు.