ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం రామన్నపాలెంలో బుధవారం చింతలపూడి టిడిపి, బిజెపి, జనసేన ఉమ్మడి అభ్యర్థి సొంగా రోషన్ కుమార్ పర్యటించారు. సందర్భంగా గ్రామంలోని స్థానిక సాయిబాబా ఆలయాన్ని ఆయన సందర్శించి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఇరుపార్టిల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.