పింఛనుదారులంతా వైసీపీకి ఓటుతో బుద్ధి చెప్పాలి: చింతమనేని

81చూసినవారు
పింఛనుదారులంతా వైసీపీకి ఓటుతో బుద్ధి చెప్పాలి: చింతమనేని
దెందులూరు నియోజకవర్గ పరిధి దుగ్గిరాలలో కూటమి అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ ను రాష్ట్ర పెన్షన్ సంఘ నాయకులు సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పెన్షన్లకు జగన్ పాలనలో ఎదురవుతున్న సమస్యలపై రూపొందించిన కరపత్రాలను అందజేశారు. అనంతరం చింతమనేని మాట్లాడుతూ జగన్ పాలనలో అవస్థ పడుతున్న పింఛనుదారులంతా వైసీపీకి ఓటుతో బుద్ధి చెప్పాలని అన్నారు.

సంబంధిత పోస్ట్