చంద్రబాబును కలిసిన జడ్పీ చైర్ పర్సన్ దంపతులు

58చూసినవారు
చంద్రబాబును కలిసిన జడ్పీ చైర్ పర్సన్ దంపతులు
అమరావతిలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడుని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా జడ్పీ చైర్ పర్సన్ గంటా పద్మశ్రీ ప్రసాద్ దంపతులు బుధవారం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. అనంతరం చంద్రబాబుకు పోలా బొకే ఇచ్చి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు సమక్షంలో వారు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో మంత్రి నిమ్మల రామానాయుడు, ఏలూరు జిల్లా టిడిపి అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్