బండి ముత్యాలమ్మ అమ్మవారి హుండీ ఆదాయం లెక్కింపు

560చూసినవారు
బండి ముత్యాలమ్మ అమ్మవారి హుండీ ఆదాయం లెక్కింపు
మొగల్తూరు మండలంలోని ముత్యాలపల్లి గ్రామంలో వేంచేసియున్న బండి ముత్యాలమ్మ అమ్మవారి హుండీ ఆదాయాన్ని శనివారం లెక్కించమని ఆలయ కార్యనిర్వాహణాధికారి దెందుకూరి రామకృష్ణంరాజు తెలిపారు. గత 64 రోజులుగా యాత్రికులు అమ్మవారికి కానుకలు మొక్కుబడుల రూపంలో హుండీలో సమర్పించుకున్న ఆదాయం 14,63,735 రూ సమకూరిందని ఆయన తెలిపారు. ఈ హుండీ ఆదాయాన్ని భీమవరం దేవాలయాల తనిఖీదారు వర్ధినిడి వెంకటేశ్వర పర్యవేక్షణలో లెక్కించామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్