ధాన్యం బకాయిలు వెంటనే చెల్లించాలని రైతులు ధర్నా

78చూసినవారు
ప్రభుత్వం రైతులకు చెల్లించవలసిన ధాన్యం బకాయిలను వెంటనే చెల్లించాలని కోరుతూ శుక్రవారం పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలం చిట్టవరం గ్రామంలో ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో నేషనల్ హైవే 216 పై ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రైతులు భారీగా పాల్గొనడంతో రహదారి కి ఇరువైపుల ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్