నరసాపురం: 24 దుకాణాలకు ముగిసిన లాటరీ విధానం

78చూసినవారు
నరసాపురం: 24 దుకాణాలకు ముగిసిన లాటరీ విధానం
నరసాపురం ప్రొహిబిషన్ , ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని 24 దుకాణాలకు మద్యం షాపుల లాటరీ ప్రక్రియ సోమవారం ముగిసింది. పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి చేతులమీదుగా ఈ లాటరీ ప్రక్రియను ప్రారంభించారు. నరసాపురం స్టేషన్ పరిధిలోని మొత్తం 24 మద్యం దుకాణాలకు గాను 958 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీటిలో లాటరీ ద్వారా ఎంపిక చేశారు. ఈనెల 16 నుంచి షాపులను ప్రారంభించాల్సి ఉంటుందన్నారు.

సంబంధిత పోస్ట్