నరసాపురం: ముంపు గ్రామాలకు మేలు జరిగేలా ఇరిగేషన్ పనులు

83చూసినవారు
నరసాపురం: ముంపు గ్రామాలకు మేలు జరిగేలా ఇరిగేషన్ పనులు
రైతులకు, ముంపు గ్రామాల ప్రజలకు ప్రయోజనం చేకూరేలా వివిధ ఇరిగేషన్ పనులను చేపట్టి పూర్తి చేయడం జరిగిందని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి అన్నారు. గురువారం జిల్లా జాయింట్ కలెక్టర్ నరసాపురం మండలం దర్భరేవు డ్రైన్ కు సంబంధించి రూ.23 లక్షలతో చేపట్టిన పూడికతీత పనులు, యలమంచిలి మండలం కాజా అవుట్ ఫాల్ స్లూయిజ్ కు సంబంధించి రూ.20 లక్షలతో చేపట్టిన షట్టర్ పనులు జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి సంబంధించిన శాఖల అధికారులతో క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

సంబంధిత పోస్ట్