నరసాపురం: యాత్రికుల సౌకర్యార్ధం సూచనలు

70చూసినవారు
నరసాపురం: యాత్రికుల సౌకర్యార్ధం సూచనలు
నవంబర్ 2వ తేది నుంచి కార్తీక మాసం ప్రారంభమం సందర్భంగా పేరుపాలెం బీచ్ కు వచ్చే యాత్రికుల సౌకర్యార్ధం చేయవలసిన ఏర్పాట్ల కోసం, ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులతో గురువారం నరసాపురం సబ్ కలెక్టర్ కార్యాలయం నందు సమీక్షా సమావేశం జరిగింది. సబ్ డివిజనలోని పోలీసులు, డివిజనల్ పంచాయితీ అధికారులు, వివిధ శాఖల అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్