నర్సాపురం నియోజకవర్గ దళితుల ఆత్మీయ సమావేశం శనివారం సీతారాంపురం జే.బీ.ఆర్. స్కూల్ క్యాంపస్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చైర్మన్ మోషేన్రాజు ముఖ్య అతిథిగా హాజరై సభా ప్రాంగణాన్ని ఆవిష్కరించారు. దళితుల హక్కులు కాపాడేందుకు పోరాట సమితి చేస్తున్న ప్రయత్నాలను ఆయన అభినందించారు. ముందుగా నర్సాపురం ఎంపీ పి. మైలాబత్తుల సోనీ తదితరులు ఆయనకు ఘన స్వాగతం పలికారు.