ప్రకాశం బ్యారేజీకి 11, 40, 000 క్యూసెక్కుల వరద నీరు

69చూసినవారు
విజయవాడలో వరద బాధితులకు ఏర్పాటుచేసిన భోజన ఏర్పాట్లను మంత్రి నిమ్మల రామానాయుడు మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. వందేళ్ల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రకాశం బ్యారేజీకి 11, 40, 000 క్యూసెక్కుల వరద నీరు వచ్చిందన్నారు. సహాయక చర్యలు ముమ్మరం చేశామన్నారు. వరద బాధితుల సహాయార్థం వస్తున్న స్వచ్ఛంద సంస్థలకు కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్