వరద బాధితులకు ఆహారపు ప్యాకెట్లను వితరణ చేసిన ఆక్వా రైతు సంఘం

66చూసినవారు
పాలకొల్లు జై భారత్ క్షీరా రామ ఆక్వా రైతు సంఘం ఆధ్వర్యంలో, విజయవాడ వరద బాధితులకు 2వేల బిరియాని ప్యాకెట్లను పాలకొల్లు నుండి విజయవాడకు మంగళవారం ఉదయం వాహనంలో తరలించారు. జై భారత్ క్షీరా రామ ఆక్వా రైతు సంఘ కార్యాలయం నుండి ఆహారం ఉన్న వాహనం విజయవాడకు బయలుదేరింది. సంఘ అధ్యక్షుడు గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు, తహసిల్దార్ వై. దుర్గా కిషోర్ తదితరులు జెండా ఊపి ఆహారం ఉన్న వాహనాన్ని విజయవాడకు పంపించారు.

సంబంధిత పోస్ట్