విజయవాడలో సిద్ధం బస్సు యాత్రలో సీఎం జగన్ గారి పై రాళ్లతో దాడి చేయడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని ఏపీ ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ పెండ్ర వీరన్న అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డికి సిద్ధం బస్సు యాత్రలో వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు ఇంత దారుణానికి ఒడిగట్టాయని రాష్ట్ర ఎంబీసీ చైర్మన్ పెండ్ర వీరన్న వ్యాఖ్యానించారు.