ప్ర‌ధాని మోదీకి ప‌వ‌న్ పాదాభివంద‌నం (వీడియో)

70చూసినవారు
రాజ‌మహేంద్ర‌వ‌రం వేదిక‌గా కూట‌మి నిర్వ‌హిస్తోన్న బ‌హిరంగ స‌భ‌లో ఆస‌క్తిక‌ర సంఘ‌ట‌న చోటు చేసుకుంది. స‌భలో పాల్గొన్న ప్ర‌ధాని న‌రేంద్ర మోదీని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ శాలువాతో స‌త్క‌రించారు. అనంత‌రం మోదీకి ఆయ‌న పాదాభివంద‌నం చేశారు. దీంతో అలా చేయవద్దని పవన్‌కు మోదీ సూచించారు. అంతకుముందు మోదీని సన్మానించిన టీడీపీ నేత నారా లోకేశ్.. ఆయనకు శ్రీ‌వారి ప్రతిమను బహూకరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్