రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్పై జరిగిన దాడి సందర్భంలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంపై సంబంధిత శాఖ అధికారులు సమాధానం చెప్పాలని టీడీపీ తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జి వలవల బాబ్జీ డిమాండ్ చేశారు. ఆదివారం తాడేపల్లిగూడెంలోని విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ విషయంలో చంద్రబాబును కించపరిచేలా డిప్యూటీ సీఎం మాట్లాడడం సరికాదన్నారు.