తణుకు: కాలువలో భవానీ భక్తుడు గల్లంతు

59చూసినవారు
తణుకు: కాలువలో భవానీ భక్తుడు గల్లంతు
తణుకు మండలం తేతలికి చెందిన కాజా దుర్గాప్రసాద్‌ (23) స్థానికంగా ఇటుకల బట్టీలో కూలీగా పని చేస్తున్నాడు. మూడు నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకుని తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నాడు. ఇటీవల భవాని మాల ధరించిన ఆయన అత్తిలి కాల్వలో మంగళవారం రాత్రి స్నానానికి దిగి నీటి ప్రవాహానికి కొట్టుకుపోయాడని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని గాలిస్తున్నారు.

సంబంధిత పోస్ట్