స్కూటీ దహనం కేసులో ముగ్గురు అరెస్టు

59చూసినవారు
స్కూటీ దహనం కేసులో ముగ్గురు అరెస్టు
తణుకు మండలం వేల్పూరులో స్కూటీల దహనం కేసులో ముగ్గురిని అరెస్టు చేసినట్లు తణుకు రూరల్‌ ఎస్సై మూర్తి సోమవారం తెలిపారు. గ్రామంలోని రెడ్డి నరేంద్రప్రసాద్‌కు చెందిన స్కూటీలను ఈనెల 10 అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు దగ్ధం చేశారు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు విచారణ చేపట్టి నిందితులు ఆనంద్‌కుమార్‌ (వీరభద్రపురం), జయసూర్యచంద్ర (వెంకట్రాయపురం), రాజేష్ (వేల్పూరు)లను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.

సంబంధిత పోస్ట్