పింఛన్ పంపిణీ ప్రారంభించిన ఎమ్మెల్యే

83చూసినవారు
పాలకోడేరు మండలం వేండ్ర గ్రామంలో ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణరాజు ఎన్టీఆర్ పింఛన్ భరోసా కార్యక్రమాన్ని సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన లబ్ధిదారులకు పెంచిన పింఛన్‌ను అందించారు. అనంతరం మాట్లాడుతూ. ఎన్నికలలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు పింఛన్ అందజేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన ఇన్‌ఛార్జి జుత్తిగ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్