ఇది ఎంతో చరిత్రాత్మకమైన రోజు అని
జనసేన అధినేత పవన్ కళ్యాన్ అన్నారు. కూటమి విజయం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఐదు కోట్లమంది ప్రజల కోసం పనిచేస్తానని, వైకాపా నేతలు మాకు వ్యక్తిగత శత్రువులు కాదని, ఆ పార్టీపై కక్ష సాధింపు చర్యలు ఉండవు అని అన్నారు. ఏపీకి చీకటి రోజులు ముగిశాయని, ఉద్యోగులకు సీపీఎస్ విషయంలో న్యాయం చేస్తామని తెలిపారు. మెగా డీఎస్సీ విడుదల చేసే బాధ్యత నేను తీసుకుంటానని, డబ్బు కోసమో, పేరు కోసమో రాజకీయాల్లోకి రాలేదని పవన్ చెప్పారు.