AP: 'చలో మాచర్ల'ను పోలీసులు అడ్డుకోవడాన్ని టీడీపీ నేత దేవినేని ఉమ ఖండించారు. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. "పిన్నెల్లి దేశం వదిలిపెట్టి వెళ్లారేమో? ఆయన అదృశ్యం వెనుక ధనుంజయ్రెడ్డి ఉన్నారు. కేంద్ర అధికారుల ఆధ్వర్యంలోనే ఓట్ల కౌంటింగ్ జరగాలి." అని ఉమ డిమాండ్ చేశారు.