రాజస్థాన్లోని కోట నగరం విద్యకు దేశవ్యాప్తంగా ప్రసిద్ధి అన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా అక్కడ షాకింగ్ ఘటన జరిగింది. కోటాలోని ఎన్హెచ్ 52 హైవేపై ఓ ప్రేమ జంట బైక్ పై వెళ్తూ రొమాన్స్ లో మునిగిపోయారు. ప్రేమికుడు బైక్ డ్రైవ్ చేస్తుంటే.. యువతి ట్యాంక్పై కూర్చొని ప్రేమికుడిని హత్తుకుని ముద్దులు పెట్టుకుంటుంది. ఈ సంఘటన ఎప్పుడు జరిగిందో స్పష్టత లేదు. ఈ వీడియో నెట్టింట వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.