AP: బెజవాడ ఇంద్రకీలాద్రి భక్తుల రద్దీతో కిటకిటలాడుతోంది. శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దర్శనానికి భక్తలు భారీగా తరలివస్తున్నారు. వేసవి సెలవులు కావడంతో భక్తుల రద్దీ పెరిగింది. రోజుకు 50 వేల మంది వరకు వస్తున్నారని.. రూ.25 లక్షల దాకా టిక్కెట్ల ఆదాయం వస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇక్కడ ముందుగా క్షేత్ర పాలకుడు ఆంజనేయస్వామిని దర్శించుకొని.. స్వామి, అమ్మవార్ల ఆశీస్సులను భక్తులు పొందుతుంటారు.