రాజస్థాన్లోని అజ్మీర్లో గురువారం ఊహించని ప్రమాదం జరిగింది. పికప్ ట్రక్కు డ్రైవర్ రివర్స్ గేర్లో వెళ్తూ మోహిని దేవి (54)ను ఢీకొట్టాడు. ఆమెపై నుంచి పికప్ ట్రక్కు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో మహిళ నడుము విరిగిపోయింది. ప్రస్తుతం బాధిత మహిళ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె పరిస్థితి విషమంగా ఉంది. దీనిపై మహిళ భర్త ఆదర్శ్నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ప్రమాద వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.