విద్యుత్ స్తంభం పడడంతో పాఠశాల విద్యార్థులకు గాయాలు

50చూసినవారు
కడప జిల్లా బద్వేలు నియోజకవర్గ పరిధిలోని అట్లూరు మండలం కామసముద్రం ప్రాథమిక పాఠశాల విద్యార్థులు పాఠశాల ఆవరణ సమీపంలో ఆడుకుంటున్న సమయంలో బుధవారం విద్యుత్ స్తంభం పిల్లలపై జారి పడడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఐదవ తరగతి చదువుతున్న స్రవంతికి కాలు విరగగా మరో నలుగురికి గాయాలయ్యాయి. అనంతరం వారిని ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్