కుందూ నది బ్రిడ్జిపై వినాయక నిమజ్జనానికి ఏర్పాట్లు: సీఐ

68చూసినవారు
కుందూ నది బ్రిడ్జిపై వినాయక నిమజ్జనానికి ఏర్పాట్లు: సీఐ
ప్రొద్దుటూరు మండలం చెన్నమరాజుపల్లె, కామనూరు కుందూ నది బ్రిడ్జిపై వినాయక నిమజ్జనానికి ఏర్పాట్లు చేశామని సోమవారం రూరల్ సీఐ బాల మద్దిలేటి తెలిపారు. దువ్వూరు క్రాస్ రోడ్డు నుండి చెన్నమరాజుపల్లె
మీదుగా నిమజ్జన ప్రదేశానికి వెళ్లాలన్నారు. అనంతరం కామనూరు నక్కలదిన్నె, గోపవరం మీదుగా కొర్రపాడు రోడ్డుకు పోవాలని, గోపవరం మీదుగా కామనూరు వైపుకు ఎలాంటి వాహనాలు అనుమతించమన్నారు. పగలే నిమజ్జన కార్యక్రమాన్ని చేయాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్