రోడ్డున పడిన 1.08 లక్షల మంది వాలంటీర్లు

69చూసినవారు
రోడ్డున పడిన 1.08 లక్షల మంది వాలంటీర్లు
వైసీపీఎమ్మెల్యేలు చెప్పారనో, ఆ పార్టీ నేతలు ఒత్తిడి తెచ్చారనో రాజీనామా చేసిన గ్రామ, వార్డు వాలంటీర్ల పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా తయారైంది. ఉన్నదాంతో పాటు రాబోతున్న అదనపు ఆర్థిక ప్రయోజనాలూ కోల్పోతున్నామని వాపోతున్నారు. సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడ్డాక రాష్ట్రవ్యాప్తంగా 1,08,273 మంది వాలంటీర్లు రాజీనామా చేశారు. వీరిలో అత్యధికంగా అనంతపురం జిల్లాలో 6,398, పార్వతీపురం మన్యం జిల్లాలో అత్యల్పంగా 515 మంది ఉన్నారు.

సంబంధిత పోస్ట్