పావో నుర్మి గేమ్స్‌లో నీర‌జ్ చోప్రాకు స్వ‌ర్ణ ప‌త‌కం

55చూసినవారు
పావో నుర్మి గేమ్స్‌లో నీర‌జ్ చోప్రాకు స్వ‌ర్ణ ప‌త‌కం
భార‌త స్టార్ జావెలిన్ త్రోయ‌ర్‌ నీర‌జ్ చోప్రా పావో నుర్మి గేమ్స్‌లో స్వ‌ర్ణ ప‌త‌కాన్ని గెలుచుకున్నాడు. ఫిన్‌లాండ్‌లో జ‌రిగిన టోర్నీలో జావెలిన్‌ను ఏకంగా 85.97 మీట‌ర్లు విసిరి స‌త్తా చాటారు. ఈ టోర్నీలో ఎనిమిది మంది అథ్లెట్లు పాల్గొన్నారు. కాగా, పారిస్ ఒలింపిక్స్ ముందు నీర‌జ్ ప్ర‌ద‌ర్శ‌న మ‌రోసారి ప‌త‌కంపై భార‌త్ ఆశ‌ల‌ను పెంచేసింది. నీర‌జ్‌ తర్వాత ఫిన్‌లాండ్‌కు చెందిన కెరానెన్, హెలాండర్లు రజతం, కాంస్యాన్ని గెలుచుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్