భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా పావో నుర్మి గేమ్స్లో స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నాడు. ఫిన్లాండ్లో జరిగిన టోర్నీలో జావెలిన్ను ఏకంగా 85.97 మీటర్లు విసిరి సత్తా చాటారు. ఈ టోర్నీలో ఎనిమిది మంది అథ్లెట్లు పాల్గొన్నారు. కాగా, పారిస్ ఒలింపిక్స్ ముందు నీరజ్ ప్రదర్శన మరోసారి పతకంపై భారత్ ఆశలను పెంచేసింది. నీరజ్ తర్వాత ఫిన్లాండ్కు చెందిన కెరానెన్, హెలాండర్లు రజతం, కాంస్యాన్ని గెలుచుకున్నారు.