ఐపీఎల్ 2025లో భాగంగా లక్నో వేదికగా శుక్రవారం లక్నో సూపర్ జెయింట్స్తో జరుగుతున్న మ్యాచ్లో ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ సూర్య కుమార్ యాదవ్ హాఫ్ సెంచరీ సాధించారు. సూర్య కుమార్ 31 బంతుల్లో 50 పరుగులు పూర్తిచేసుకున్నారు. ఐపీఎల్లో సూర్య కుమార్కు ఇది 25వ అర్థశతకం.పైగా సూర్యకి ఇది ముంబై తరఫున 100వ ఐపీఎల్ మ్యాచ్. దీంతో 14 ఓవర్లు ముగిసేసరికి MI స్కోర్ 133/3గా ఉంది. క్రీజులో సూర్య(53), తిలక్(13) ఉన్నారు.