గుజరాత్‌లో అంతుచిక్కని వ్యాధితో 8 రోజుల్లో 15 మంది మృతి

55చూసినవారు
గుజరాత్‌లో అంతుచిక్కని వ్యాధితో 8 రోజుల్లో 15 మంది మృతి
గుజరాత్‌లోని కచ్ జిల్లా లఖ్‌పత్ పట్టణంలో వారం రోజులుగా చాపకింద నీరులా విస్తరిస్తున్న అంతుచిక్కని వ్యాధితో ఇప్పటికే 15 మంది ప్రాణాలు విడిచారు. సెప్టెంబర్ 3 నుంచి 7 వరకు 10 మంది చనిపోగా, ఆ తర్వాత మరో ఐదు మరణాలు నమోదయ్యాయి. మొదట పిల్లలు, పెద్దలకు ఈ వ్యాధి సోకింది. మరణించిన వారి నుండి సేకరించిన 11 నమూనాలను పూణేలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపినట్లు జిల్లా కలెక్టర్ అమిత్ అరోరా తెలిపారు.

సంబంధిత పోస్ట్